![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -75 లో.... రామరాజుపై ఉన్న కోపంతో చందు లవ్ ఫెయిల్యూర్ అయ్యాడని, అందుకు తాగుతున్నాడని రామరాజుతో చెప్తుంది. దాంతో రామరాజు బాధపడుతూ లోపలకి వెళ్ళిపోతాడు.రాత్రి చందు బాధపడుతుంటే రామరాజు తన దగ్గరికి వెళ్తాడు. ఇంత బాధపడుతున్నావ్.. వాళ్ళలాగా నన్ను మోసం చెయ్యాలి అనిపించలేదా అని రామరాజు అడుగుతాడు. లేదు నాన్న నాకు నా ప్రేమ కంటే మీ ప్రేమ గొప్పదని రామరాజు గురించి గొప్పగా చందు మాట్లాడతాడు. నాకు నువ్వు అందరిలో మాట్లాడే ధైర్యం ఇచ్చావ్ రా.. నువ్వు అసలైన కొడుకు అంటే అని రామరాజు గర్వంగా మాట్లాడతాడు. అదంతా సాగర్, ధీరజ్, వేదవతి లు వింటుంటారు.
అదంతా విని సాగర్, ధీరజ్ లని వేదవతి పక్కకి తీసుకొని వచ్చి.. నేను ముందు నుండే అడుగుతున్నా పెద్దోడు ఎందుకు అలా ఉన్నాడని మీరే చెప్పలేదని కోప్పడుతుంది. అప్పుడే నర్మద వచ్చి.. అత్తయ్య.. వాళ్లకి మీకు చెప్పే దైర్యం లేదు. మీరు బాధపడకండి.. మేమ్ అందరం బావ గారి బాధకు కారణం అయ్యాం కనుక మేమే దగ్గరుండి బావ గారి పెళ్లి జరిపిస్తామని వేదవతికి నర్మద చెప్తుంది. నవ్వండి అత్తయ్య అంటూ నర్మద వేదవతిని నవ్విస్తుంది.
మరొకవైపు ప్రేమ, ధీరజ్ లు ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ప్రేమ నేలపై పడుకుంటూ ఉంటుంది. నీకు నొప్పి ఉంది కదా పైన పడుకోమని అనగానే నువ్వు ఎందుకు అలా అంటున్నావో నాకు తెలుసు.. అందరి ముందు బిల్డప్ ఇచ్చుకోవడానికా అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |